పాలిస్టర్ వస్త్రానికి కూలీ పెంచే విధంగా యజమానులపై.!

wages wages

పాలిస్టర్ వస్త్రానికి కూలీ పెంచే విధంగా యజమానులపై చర్యలు తీసుకోవాలి

సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో జిల్లా లేబర్ అధికారికి వినతిపత్రం అందజేత

సిరిసిల్లలో పాలిస్టర్ వస్త్రానికి సంబంధించి పవర్లూమ్ , వార్పిన్ , కార్మికులు

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని పాలిస్టర్ వస్త్రానికి సంబంధించి పవర్లూమ్ కార్మికులకు , వార్పిన్ , వైపని కార్మికులకు అదేవిధంగా టెక్స్ టైల్ పార్క్ కార్మికులకు సంబంధించి యజమానులు కూలి పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా లేబర్ అధికారికి వినతిపత్రం అందజేయడం జరిగినది.
ఈ సందర్భంగా సి.ఐ.టి.యు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ మాట్లాడుతూ పాలిస్టర్ వస్త్రానికి సంబంధించి పవర్లూమ్ కార్మికులకు , వార్పిన్ , వైపని కార్మికులకు మరియు టెక్స్టైల్ పార్కు కార్మికులకు కూలి ఒప్పందం ముగిసి సంవత్సరం దాటిందని యజమానులు కూలీ పెంచకపోవడంతో కార్మికులకు సరైన వేతనాలు రాక ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మికుల కూలి పెంచాలని పలు దఫాలుగా యజమానులకు విన్నవించినా కూడా కూలీ పెంపు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కార్మికుల కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వకుండా నష్టం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
పాలిస్టర్ వస్త్రానికి సంబంధించి కార్మికులకు సంబంధించి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూలీ అగ్రిమెంట్ జరుగుతుందని 2022 సంవత్సరం ఏప్రిల్ నెలలో జరిగిన కూలీ ఒప్పందం 2024 ఏప్రిల్ నెలతో ముగిసిందని కూలీ ఒప్పందం ముగిసి ఇప్పటికీ సంవత్సరం దాటినా కూడా యజమానులు కూలీ పెంచడం లేదని కావున ఇప్పటికైనా లేబర్ అధికారులు యజమానులతో వెంటనే కూలి చర్చలు జరిపించి కూలి పెంచాలని లేకుంటే రానున్న రోజుల్లో అవసరమైతే నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు, ఎగమంటి ఎల్లారెడ్డి,సిఐటియు నాయకులు కోల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!