విద్యా మందిర్ క్లాసెస్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి

ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్..

హన్మకొండ, నేటిధాత్రి:

హాన్మకొండ జిల్లా మరియు వరంగల్ జిల్లా వివిధ మండలాలలోని (విఎంసి)ఎంపీసీ+ఐఐటి-జెఇఇ@బైపిసి+నీట్ జూనియర్ కళాశాల పేర్లతో ఎక్కడపడితే అక్కడ అడ్మిషన్ ప్రారంభం అవుతున్నాయని,బారి, ఫ్లెక్సీలు (హోల్డింగ్) ఏర్పాటుచేసి ముందస్తు ప్రచారం నిర్వహిస్తున్నారని వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి మరియు విద్యాశాఖ అధికారులకు చెప్పినప్పటికీ కూడా పట్టించుకోకుండా 2024,2025, సంవత్సరం కోసం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ మండలాల్లోని విద్యార్థి విద్యార్థుల మోసం చేస్తూ అడ్మిషన్ చేసుకుంటున్నారని ఏబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్ అన్నారు ప్రభుత్వ నిబంధన ప్రకారం 2023,2024, విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత అడ్మిషన్ ప్రక్రియ చేపట్టాలి కానీ ఇక్కడ దానికి భిన్నంగా నగరంలో ఎక్కడపడితే అక్కడ భారీ ఫ్లెక్సీ(ఓడింగ్స్) ఏర్పాటు చేసుకొని కనీసం సౌకర్యాలు లేకుండా కళాశాలలు ఏర్పాటు చేసుకొని విద్యార్థి తల్లిదండ్రుల నుండి అధిక డబ్బులు వసూలు చేస్తున్నా విద్యాశాఖ అధికారులు స్పందించకపోవడం సిగ్గు చెటని అధికారుల కార్పొరేట్ కళాశాలలకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని నిదర్శనం అని అన్నారు ఇప్పటికైనా సంబంధిత విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని అదేవిధంగా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న (వీఎంసి) యాజమాన్యంపై చర్యలు తీసుకొని యాజమాన్యం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను (హోడింగ్లను) తొలగించవలసిందిగా అధికారులు కోరారు,లేనియెడలా కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తాము అని బోట్ల నరేష్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!