వనపర్తి నేటిదాత్రి : వనపర్తి
జిల్లా కేంద్రంలో గుట్ట లు మబ్బుగుట్ట దగ్గర గుట్టలను మొత్తం తవ్వి దాదాపున్. 1000 నుండి 1500 టిప్పర్ల వరకు మొరం తీసుకువెళ్లిన మాఫియా పై చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ సెల్ నెంబర్ 9490094100 తెలిపారు వనపర్తి లో గుట్టలు కట్టెలు ఇసుక ఈ మూడు మాఫియాలు కలిసి వనపర్తిని వినాశనానికి దారితీస్తుందని అదేవిధంగా అడవి మాయమైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై ఫోన్లో వనపర్తి తహసిల్దార్ యాదగిరి గారికి సమాచారం ఇస్తే నాకు తెలియదని నాలుగో తరగతి ఉద్యోగులకు అప్పగించామని మైనింగ్ శాఖ అధికారులను అడగాలని అన్నారని ఆయన తెలిపారు పీర్లగుట్ట వెనక 974 సర్వే నెంబర్లు దాదాపు వెయ్యి నుండి 1500 టిప్పర్ల వరకు గుట్ట ను తవ్వి మొరం మాయమైందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు 471 లో సర్వే నెంబర్లు దగ్గర ప్లాట్లు ఇచ్చారు కదా అని తహసిల్దార్ గారిని అడిగితే ఈ విషయం కూడా నాకు తెలియదని మైనింగ్ వారిని అడిగి తెలుసుకోవాలని అన్నారు అని తెలిపా రు అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో గుట్టలను పీర్లగుట్ట మబ్బుగుట్ట ప్రాంతాలను సందర్శించామని ఆయన పేర్కొన్నారు వెంటనే జిల్లా కలెక్టర్ మైనింగ్ శాఖ అధికారులు గుట్టలు అన్యక్రాంతం కాకుండా తనిఖీ చేసి బాధ్యులైన మాఫియా పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఐ నాయకులు గోపాలకృష్ణ శివ రమేష్ అరవింద్ తదితరులు ఉన్నారు