కాంగ్రెస్ నాయకుడి పైనా చర్యలు తీసుకోవాలి.

Congress leader Congress leader

కాంగ్రెస్ నాయకుడి పైనా చర్యలు తీసుకోవాలి
బిఆర్ఎస్ నాయకుల డిమాండ్

మందమర్రి నేటి ధాత్రి:

 

మందమర్రి లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినా పాత్రికేయుల సమావేశం లో ఇటీవల పాత్రికేయుని పైన అనుచిత వాక్యాలు చేసిన కాంగ్రెస్ నాయకుడు పైడిమల్ల నర్సింగ్ బేషరతుగా క్షమాపణ లు చెప్పాలని బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జె. రవీందర్ ఆరోపించారు.ప్రజలకి రాజకీయ నాయకుల మధ్యలో వారధి గా వ్యవహరిస్తున విలేఖరులకి రక్షణ లేకుంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. మందమర్రి లోని జర్నలిస్ట్ లు అందరూ కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం అన్నారు . పోలీస్ వ్యవస్థ పైన మాకు నమ్మకం ఉంది అధికారం లో ఉన్న నాయకుల కోసం కాకుండా ప్రజల గురించి వారి సమస్యల పైన విధులు నిర్వహించాలని కోరారు . ఇప్పటికైనా చెన్నూరు ఎమ్మెల్యే కార్మిక,మైనింగ్ శాఖ మంత్రి వివేక్ స్పందించి తక్షణమే కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో టిబిజికెస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్ సీనియర్ నాయకులు ఓ.రాజశేఖర్,మద్ది శంకర్ ,ఎండీ అబ్బాస్, బండారి సూరిబాబు, మల్లేష్, తోట సురేందర్,కనకం రవీందర్, అందే శ్రీకాంత్,ఎం.డి ముస్తఫా ముల్కల్ల రమేష్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!