మల్లికార్జున రియల్ ఎస్టేట్ పేరుతో వ్యవసాయ భూమలను అన్యాయంగా దోచుకుంటున్న కుమ్మరి మల్లేశం పై చర్యలు తీసుకోవాలి

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి అందే బీరన్న

చేర్యాల నేటిధాత్రి…

పేద ప్రజల భూములను బెదిరించి రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చుకొంటున్న మల్లికార్జున రియల్ ఎస్టేట్ పేరుతో వ్యవసాయ భూమలను అన్యాయంగా దోచుకుంటున్న కుమ్మరి మల్లేశం పై చర్యలు తీసుకోవాలని ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అందె బీరన్న అన్నారు.
చేర్యాల ప్రాంతంలో వ్యవసాయ భూముల్లో ప్లాట్ల క్రయ,విక్రయాల ద్వారా వందల కోట్లు చేతులు మారాయని గత ప్రభుత్వం అండదండలతో ప్రశ్నించిన ప్రతిపక్షాల మీద దాడులు చేయిస్తూ అరాచకాలకు పాల్పడుతున్నారని వాళ్లపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని,
పేదల రక్తాన్ని సొమ్ము చేసుకున్న మల్లేశం న్ని సిబిఐ తో ఎంక్వయిరీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కంట్రోల్ కమిటీ చైర్మన్ అందే బీరన్న  డిమాండ్ చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!