కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ నగరంలోని కలెక్టర్ రేట్ కీ అతి సమీపంలో ఉన్న కృషి భవన్ కిరాయికి ఉన్న కిరాయిదారులను ఆటంకాలు కలిగిస్తూ మనోవేదనకు గురి చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజులు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆయొక్క షట్టర్ లను, నీళ్లతో నిండిన రూములను, నీళ్లు పడి చెడిపోయిన కంప్యూటర్లను, ఫర్నిచర్ ను వారు సందర్శించి అక్కడి పరిస్థితిని చూసి వారు అవాక్కు కావడం జరిగిందని ఈసందర్భంగా కసిరెడ్డి సురేందర్ రెడ్డి, పైడిపల్లి రాజులు మాట్లాడుతూ మానవ విలువలు పూర్తిగా మంటగలిసే విధంగా షట్టర్ పైకప్పుకు రంధ్రం చేసి అందులో నుండి నీళ్లు వదిలిపెట్టి ఆఫీసులోని సామాగ్రి విలువైన పేపర్స్ డాక్యుమెంట్ లు పూర్తిగా నీటిమయం చేయడం దుర్మార్గమైన చర్య అని దీనిని ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు. ఒక షెటర్లో పొల్యూషన్ సెంటర్, మరో షటర్ లో ఆటో కన్సల్టెన్సీ కార్యాలయం ఉందని వీరు ఉపాధి లేక స్వయం ఉపాధితో పనిచేసుకుంటూ జీవనం గడుపుతున్నారని వీరి యొక్క పనులకు ఆటకం కలగజేస్తూ గత మూడు నెలల నుండి మానసికంగా వేధింపులకు గురిచేస్తూ, ఒత్తిడిలకు, భయభ్రాంతులకు కలగజేస్తూ మానవత్వాన్ని పూర్తిగా మరిచిపోయి నిర్ధాక్షిణంగా ప్రవర్తిస్తున్న కృషి భవన్ నిర్వహణదారులపై జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీంతోపాటు వీరి షట్టర్ల ముందు చెత్తాచెదారం,షెటర్ కు అడ్డంగా ఇటుకలు, గోవా కట్టలు కట్టి పూర్తిగా షట్టర్ కనబడకుండా మూసివేసే కుట్రలు చేయడం దుర్మార్గమైన చర్య అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కిరాయిదారులు పలుమార్లు కలెక్టర్ కి విన్నవించిన పట్టించుకునేనాధుడు లేకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం స్థలము ఇచ్చి భవనానికి నిధులు కేటాయించి నిర్మిస్తే కొందరు వ్యవసాయశాఖ రిటైర్ ఉద్యోగ సంఘం నాయకులు తమదే నడవాలని పెత్తనం చేస్తూ భయభ్రాంతులకు గురిచేయడం ఏంటని ప్రశ్నించారు. వెంటనే జిల్లా అధికారులు స్పందించి ఈయొక్క సమస్యను పరిష్కరించి నిరుద్యోగుల జీవితాలను కాపాడాలని లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తామని కసిరెడ్డి సురేందర్ రెడ్డి, పైడిపల్లి రాజులు హెచ్చరించారు.