జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ప్రముఖ పుణ్యక్షేత్రం వేలాల గట్టు మల్లన్న స్వామి ని దర్శనం చేసుకున్న జైపూర్ ఏసిపి ఏ. వెంకటేశ్వర్లు, ఎస్ఐ ఉపేందర్ రావు అనంతరం మహా శివరాత్రి జాతర ఏర్పాట్ల గురుంచి అడిగి తగు సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో స్పెషల్ ఆఫీసర్ విద్యాసాగర్, పంచాయతీ కార్యదర్శి రాజేష్, గుట్టు మల్లన్న స్వామి పౌండర్ చొప్పకట్ల శ్రీకాంత్, నాయకులు మాజీ ఉప సర్పంచ్ డేగ నగేష్ పటేల్, తిరుపతి గౌడ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.