
Konda Laxman Bapuji Jayanti in Sirisilla
ఆచార్య కొండా లక్ష్మణ్ జయంతి వేడుకలు
– నివాళులర్పించిన అదనపు కలెక్టర్ గడ్డం నగేష్
సిరిసిల్ల(నేటి ధాత్రి):
ఆచార్య కొండా లక్ష్మణ్ జయంతి వేడుకలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించగా, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఇక్కడ బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి సౌజన్య, డీవైఎస్ఓ రాందాస్, ఆయా శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది, మహేష్, గోనె ఎల్లప్ప, గోలి వెంకటరమణ
తదితరులు పాల్గొన్నారు.