
Assault Case, Remanded.
వ్యక్తిపై దాడి కేసులో నిందితుని అరెస్టు.. రిమాండ్ కు తరలింపు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఉద్దేశపూర్వకంగా వ్యక్తిపై దాడి చేసిన కేసులో నిందితున్ని అరెస్టు చేసి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు జహీరాబాద్ పట్టణ ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం పట్టణ పరిధిలోని మహేంద్ర కాలనీకి చెందిన కొత్తగోళ్ల హర్షవర్ధన్ తండ్రి శివకుమార్ శాంతినగర్ కు చెందిన పాలింకర్ కమల్ కుమార్ పై పాత కక్షలు మనసులో పెట్టుకొని బుధవారం రాత్రి బీరు సీసా తో కమల్ మెడపై, నడుంపై పొడిచి పారిపోయాడన్నారు.