ఇచ్చిన మాట ప్రకారం వాల్మీకి లక్ష్మి దేవర గుడి నిర్మాణ పనులు మొదలు

కాంగ్రెస్ జైపూర్ మండల అధ్యక్షుడు మహమ్మద్ ఫయాజుద్దీన్

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో వాల్మీకి కులస్తుల కులదైవమైన లక్ష్మీ దేవర గుడి నిర్మాణం పూర్తి చేసి ఇస్తామని గత శాసనసభ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తరఫున జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ ఫయాజుద్దీన్ వాల్మీకి సంఘం నాయకులకు మాట ఇవ్వడం జరిగింది.ఎన్నికల తరువాత ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లి చర్చించడం జరిగింది. ఎమ్మెల్యే వివేక్ వెంకట్ స్వామి కూడా సానుకూలంగా స్పందించి తప్పకుండా ఆలయ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తామని గతంలోనే మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ వాల్మీకుల కుల దైవం లక్ష్మీ దేవర ఆలయ నిర్మాణంలో భాగంగా ఆదివారం రోజున జైపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ ఫయాజుద్దీన్ ఆధ్వర్యంలో స్లాబ్ పనులను ప్రారంభించడం జరిగింది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గొప్ప నాయకుడు మా వివేక్ వెంకటస్వామి అని వాల్మీకి కుల సంఘ నాయకులు కొనియాడారు. ఈ సందర్భంగా మహమ్మద్ ఫయాజుద్దీన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కులాలను అన్ని మతాలను సమానంగా అక్కున చేర్చుకుంటుందని, ఎల్లవేళలా ప్రజలకు సేవ చేసుకునే ఉద్దేశంతో పని చేస్తామని ప్రజల ఆశీస్సులు మాకు ఎల్లపుడు ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జైపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ ఫయాజుద్దీన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, వాల్మీకి కుల సంఘ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *