బి.ఆర్.యస్ నాయకుడి సవాలు స్వీకరించి సిరిసిల్ల చేరుకున్న కాంగ్రెస్ నేత ప్రవీణ్ జె.టోనీ
సిరిసిల్ల టౌన్:(నేటి ధాత్రి)
జిలెల్ల కు చెందిన బాధితులతో, ప్రభుత్వ భూమి కబ్జా పత్రాలతో మరియు పొన్నం ప్రభాకర్ గారి వద్ద ఎన్నికల్లో డబ్బులు తీసుకున్న సాక్ష్యాధారాలతో ఈరోజు సిరిసిల్ల అంబేద్కర్ వద్దకు చేరుకున్న ప్రవీణ్ జె. టోనీ..

ముందస్తుగా అదుపులోకి తీసుకున్న పట్టణ సీఐ కృష్ణ గారు, అరెస్టు చేసి సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగినది. ఈ సందర్బంగా
ప్రవీణ్ జే టోనీ మాట్లాడుతూ నిజానిజాలపై మండల కాంగ్రెస్ ఎప్పుడు సిద్ధమే
ఉద్యమాలు చేసి వచ్చిన వాళ్ళం వెనకడుగు వేయం బి.ఆర్.యస్ పార్టీ అహంకారంతో నిరంకుశ వైఖరితో పాలనను కొనసాగించి దోపిడి దౌర్జన్యం ఇంటిపేరుగా మార్చుకున్న బిఆర్ఎస్ నాయకులు
నీతులు మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది అని అన్నారు అంతే కాకుండా
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ గత పది సంవత్సరాల పాలనలో ఇసుక దొంగలు ఎవరో తెలుసు,భూ దొంగలు ఎవరో తెలుసు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై కమిషన్లు తీసుకున్నవారు తెలుసు.
రైతులను వేధించింది ఎవరో తెలుసు సామాన్యులను దోచుకుందువరో తెలుసు,దళితులను,గిరిజనులను,బీసీ,మైనారిటీలను అవమానించిన వారు ఎవరో తెలుసు.
అన్ని నీచ పనులు చేసి ఇప్పుడు తప్పుగా మాట్లాడుతున్నారు అని తెలిపారు.