*కలెక్టరేట్ ముందు ఏబీవీపీ ధర్నా

డీఈఓ కి వినతిపత్రం అందజేత

మంచిర్యాల, నేటి ధాత్రి:

ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శనివారం రోజున మంచిర్యాల జిల్లాలో ఏబీవీపీ నాయకులు కలెక్టరేట్ ముందు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో, విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తమ డిమాండ్లను తెలియజేస్తూ డిఇఓ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ విభాగ్ కళామంచి కన్వీనర్ మామిడి అక్షిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల పరిస్థితి అస్తవస్తంగా, దయనీయంగా ఉందని ఆరోపించారు. ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల ఫీజుల పేరుతో దోపిడీ, దౌర్జన్యాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని, విద్య నేర్పిస్తున్నామనే పేరుతో విద్యార్థుల భవిష్యత్తుతో వ్యాపారం చేస్తున్నారని వాపోయారు. అలాగే ప్రభుత్వం పక్కన పెట్టిన మెగా డీఎస్సీ వేసి 24 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలి అని,అదేవిధంగా ప్రభుత్వం నుండి సరైన పర్మిషన్లు లేని పాఠశాలలను వెంటనే తొలగించాలని కోరారు. రాష్ట్రంలో చాలా చోట్ల డీఈవో, ఎంఈఓ అధికారుల కొరత ఉందని వెంటనే ఈ సమస్య పరిష్కరించాలని ఏబీవీపీ తరఫున డిమాండ్ చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దీపక్ ,ఈశ్వర్ ,కార్యకర్తలు సూర్య ,చందు, కిరణ్ ,సాయి, ప్రవీణ్ ,ఆనంద్, వినోద్ ,మహేష్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!