మంద కృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం
నిజాంపేట, నేటి ధాత్రి
మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో ని స్థానిక బస్టాండ్ వద్ద ఎమ్మార్పీఎస్, కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు పాతూరి రాజు మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన అన్ని పార్టీల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మార్పీఎస్ వర్గీకరణ కు సుదీర్ఘ పోరాటం కొనసాగించిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు ఎల్లవేళలా రుణపడి ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పంజా మహేందర్ ,జిల్లా నాయకులు కొమ్మాట సుధాకర్ ,మండల అధ్యక్షుడు కొమ్మాట అమర్, ఎమ్మార్పీఎస్ నాయకులు ఎల్లం, స్వామి, శమల మహేష్ ,రాజు, స్వామి,వినోద్ తదితరులు పాల్గొన్నారు