మహబూబ్ నగర్ :: జిల్లా నేటి ధాత్రి
జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని చోక్కంపెట్ గ్రామంలో మండ్ల లక్ష్మయ్య(37) అనారోగ్యంతో మరణించారు. అలాగే రాజాపూర్ మండలంలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన బ్యాగరి అనసూయ (39) అకస్మాత్తుగా మరణించారు.
వారి మృతికి సంతాపం తెలిపిన బి ఆర్ ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి.
అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం వారి కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని అభిమన్యు యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మంచాల కృష్ణయ్య, కుత్నేపల్లి సర్పంచ్ సేవ్యనాయక్, ఉపసర్పంచ్ బోయ నీలమ్మ, వార్దుమెంబెర్ మంచాల నర్సింహులు, మంచాల మల్లేష్, బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షులు యాదగిరి, కుమ్మరి రాజు, రామకృష్ణ, బోయ జామున, ఖాధర్, సురేష్, బి ఆర్ ఎస్ నాయకులు, ఖానాపూర్ గ్రామానికి చెందిన ముస్తఫా, వెంకట్ రెడ్డి, బ్యాగరీ శేఖర్, రాజేందర్ రెడ్డి, శేఖర్, రమేష్, సంతోష్, కృష్ణ, అంజయ్య, రామలింగం,యువసేన సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.