పెద్దగుట్టలో మొక్కులు చెల్లించుకుంటున్న ఆది

సాదుల్ల బాబా దర్గాలో మొక్కు చెల్లింపు

వేములవాడ, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శాసన సభ ఎన్నికల్లో వేములవాడ నియోజక వర్గం ఎమ్మెల్యే గా ఆది శ్రీనివాస్ గెలుపొందాలని కోనరావు పేట మండలం బావుసాయి పేట ఎంపీటీసీ షేక్ యాస్మిన్ ఫిరోజ్ పాషా లు నిజామాబాద్ జిల్లా వర్ని మండలం పెద్దగుట్ట సయ్యద్ షాదుల్లా బాబా దర్గా కు మొక్కుకున్నారు. ఆది శ్రీనివాస్ అఖండ విజయం సాధించడంతో యాస్మిన్ ఫిరోజ్ పాషాలు బావుసయిపేట గ్రామం నుండి పెద్దగుట్ట వరకు పాదయాత్ర నిర్వహించారు.గురువారం పాద యాత్ర సాదుల్లా బాబా క్షేత్రానికి చేరుకున్నారు. శుక్రవారం రోజున మొక్కు చెల్లించే కార్యక్రమంలో భాగంగా వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా సాదుల్లా బాబాకు చాదర్ సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పెద్దగుట్ట లో ప్రాంతంలో సహపంక్తి భోజనాలు చేశారు.కార్యక్రమం లో జగన్మోహన్ రెడ్డి , చింతపంటి రామస్వామి, ప్రభాకర్, పులి సత్యం ,అబ్దుల్ రషీద్, కనికరపు రాకేష్ ,దేవరాజు,వేములవాడ, కొనరో పేట, చందుర్తి ,మండలాల కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
[7:10 pm, 01/03/2024] +91 98490 56295: ………️

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!