వేములవాడ నేటి దాత్రి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆరోగ్యశ్రీ కార్డుల నిమిత్తం ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింకు తప్పనిసరి దీంతో గత వారం రోజుల నుండి ఆధార్ సేవ కేంద్రాలకు తాకిడి ఎక్కువ అయింది వేములవాడ మండల కేంద్రం లో శనివారం వివిధ గ్రామాల నుండి జనాల తాకిడి ఎక్కువ కావడంతో ఆధార్ సేవా కేంద్రల ముందర జనాలు బారులు తీరారు ఈనెల 30తో గడువు తీయడంతో జనాలు అవస్థలు పడుతున్నారు
ప్రస్తుత తరుణంలో అన్నిటికీ ఆధార్ ఆధారమైంది ఆధార్ దిగి పదేళ్లు దాటిన వారు సమీకరించుకోవాలని అధికారులు సూచించారు దీంతో ప్రజలంతా ఆధార్ కార్డు సమీకరణకై దృష్టి సారించారు భుత్వ పథకాల లబ్ధి పొందేందుకు ఆధార్ కార్డు కీలకము పింఛన్లు రేషన్ కార్డులు బ్యాంకు ఖాతాలకి సీఎం సహాయ నిధికి రైతుబంధు వంటి పథకాలకు ఆధార్ తప్పనిసరి చాలామంది చిరునామా ఫోన్ నెంబర్లు వంటి వివరాలను అప్డేట్ చేయించుకోలేదు పింఛన్లు రేషన్ రానివారు వేలిముద్రలను ఫోన్ నెంబర్లను సమీకరించుకునేందుకు ఆధార్ కేంద్రాలకు వరుస కడుతున్నారు ముఖ్యంగా పల్లెల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున మండల కేంద్రాలకి బారులు తీరుతున్నారు ఆయా కేంద్రాల వద్ద కనీస వసతులు లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు
సర్వర్ పేరుతో సతాయిస్తుండ్రు
వివిధ అవసరాలు ఆధార్ సవరణల కోసం ప్రజలు ఆధార్ నమోదు కేంద్రాల వద్ద వరుస కడుతున్నారు సర్వర్ రావడంలేదని పనిచేయడం లేదు అని వచ్చినవారు సమీకరణ కోసం పడి కాపులు తప్పడం లేదు వేములవాడ మండల కేంద్రంలోదాదాపు 10 మీసేవ కేంద్రాలు ఉన్న తిప్పలు మాత్రం తప్పడం లేదు ఆధార్ కేంద్రాల వద్ద పరిస్థితి మరి దారుణంగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు