పత్తి రైతులు పత్తి అమ్ముటకు ఆధార్ అనుసంధానం ఓటీపి తప్పని సరి

వెల్గటూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పత్తి పాక వెంకటేష్.

ఎండపల్లి,నవంబర్ 03, నేటి ధాత్రి

సిసిఐ, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి అమ్ముటకు ఆధార్ అనుసంధానం, ఓటీపితప్పని సరి చేసిందని,కావున పత్తి రైతులు సి.సి.ఐ.వారిచే పత్తి కొనుగోలు చెల్లింపులకై మీ ఆధార్ తో అనుసంధానమైన బ్యాంకును వెబ్ సైట్ లో (https://dbtbharat.gov.in/) లేదా (https://myaadhaar.uidai.gov.in/) లింక్ ద్వార పరిశీలించుకొని బ్యాంకు ఖాతా ఆక్టివ్ గా ఉన్నదా? లేదా? నిర్దారించుకొనవలెను.
ఒకవేళ బ్యాంకు ఖాతా ఇనాక్టివ్ గా ఉన్న దానిని ఆక్టివ్ గా మార్చుకొనుటకు లేదా మీ పేరున వాడుకలో ఉన్న ఇతర బ్యాంకు ఖాతాను ఆధార్ తో అనుసంధానం చేసుకొనుటకు సంబంధిత బ్యాంకుకు వెళ్లి అనుసంధానం , చేసుకున్నట్లయితే ఆ బ్యాంకు ఖాతాలో సిసిఐ వారు పత్తి కొనుగోలు చెల్లింపులు చేయుదురు అని వెల్గటూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పత్తి పాక వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు,కావున పత్తి రైతులు ఇట్టి విషయాన్ని గమనించ వలసిందిగా కోరడమైనది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!