
Adepu Krishna Elected New President of Bizon Traders Association
వర్తక సంఘ నూతన అధ్యక్షులుగా ఆడెపు కృష్ణ
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పట్టణ బిజోన్ వర్తక సంఘం నూతన అధ్యక్షులుగా ఆడెపు కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యవర్గాన్ని శ్రీలక్ష్మి గణేష్ మండపం వద్ద వర్తక సంఘం సభ్యులు ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శి కొండ కుమార్, కోశాధికారి ఏముల దేవేందర్ రెడ్డి,
సహాయ కార్యదర్శి గోక శ్రీనివాస్, ప్రచార ప్రతినిధి పరికిపండ్ల రాజు, గౌరవ అధ్యక్షులు పాలకుర్తి గంగాజలం,గౌరవ సలహాదారులు ఆడెపు లక్ష్మణ్, వెంగళదాసు సత్యనారాయణ, బత్తుల శ్రీనివాస్,ఆడెపు తిరుపతి, ఉపాధ్యక్షులు గుండా రమేష్ కేతుపల్లి నారాయణరెడ్డి కొక్కుల సతీష్ గడ్డం శ్రీనివాస్, బండి మల్లేష్ లను ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు ఆడెపు కృష్ణ మాట్లాడారు. బి జోన్ వర్తక సంఘం సభ్యుల సమస్యల పరిష్కారానికి తోడ్పడతానని,వర్తక సంఘం బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో వర్తక సంఘం సభ్యులు పాల్గొన్నారు.