వైద్యానికి డబ్బులు లేవని యువతీ ఆత్మహత్య.!

suicide suicide

వైద్యానికి డబ్బులు లేవని మనస్థాపం చెంది యువతీ ఆత్మహత్య.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని మండలంలోని ఒడితల గ్రామానికి చెందిన ఎర్రబెల్లి పల్లవి 19 ఇంట్లో ఉరేసుకుని గురువారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడిందని పల్లవి తండ్రి సదానందం పిర్యాదు మేరకు శవపంచనామా చేయడం జరిగింది. పల్లవి, ఆమె తల్లి విజయ ఇద్దరు అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్యానికి లక్షల్లో ఖర్చు అవుతాయని, డబ్బులు లేకపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని పిర్యాదు అందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రెండవ ఎస్సై ఈశ్వరయ్య తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!