జీవితంపై విరక్తి చెంది యువకుడు మృతి

#నెక్కొండ ,నేటి ధాత్రి:

మండలంలోని అప్పలరావుపేట గ్రామానికి చెందిన వడ్డే హర్షవర్ధన్ వయస్సు 19 సంవత్సరాలు శుక్రవారం రాత్రి సమయంలో మనస్థాపానికి లోని గుర్తుతెలియని రైలు ఢీకొని చనిపోయిన ఘటన అప్పారావుపేట గ్రామపంచాయతీలో ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. వివరాల్లోకి వెళితే వడ్డే హర్షవర్ధన్ తండ్రి నాగరాజు లది వ్యవసాయ కుటుంబం నాగరాజు 2020 మరియు20 21 సంవత్సరం గాను పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోవడంతో తిరిగి మరుసటి సంవత్సరం పదవ తరగతి పరీక్ష రాసిన ఫెయిల్ అవ్వడంతో వ్యవసాయ పనులు ఇష్టం లేక జీవితంపై విరక్తి చెంది తీవ్ర మనోవేదనతో శుక్రవారం రాత్రి సమయంలో నెక్కొండ మండలంలోని మడిపల్లి రైల్వే గేట్ సమీపంలో సూసైడ్ చేసుకున్నట్లు రైల్వే అధికారి రాజు తెలిపారు. అనంతరం హర్షవర్ధన్ మృతదేహానికి శవ పరీక్ష నిర్వహించి మృతుని తండ్రి నాగరాజు కు మృతదేహాన్ని అప్పగించినట్లు రైల్వే పోలీస్ అధికారి రాజు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *