మామిడిపల్లి గ్రామంలో తీవ్ర విషాదం
కొనరావుపేట, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో కులేరు శ్రీనివాస్ (22) అనే యువకడు శనివారం ఉరివేసుకొని మృతి చెందాడు. దీంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఎస్సై ఆంజనేయులు ఘటన స్థలానికి చేరుకునిమృతదేహాన్ని పరిశీలించి పంచనామ నిర్వహించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే యువకుడు మృతికి గల కారణం ఇంకా తెలియాల్సి ఉంది.