ట్రాక్టర్ మీది నుండి పడి యువకుడు మృతి.
కల్వకుర్తి /నేటి ధాత్రి
ప్రమాదవశత్తు ట్రాక్టర్ మీద నుండి పడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలోని తుర్కలపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం జరిగింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చెందిన సాయిబాబ (20) ట్రాక్టర్ తో పొలం దున్నుతుండగా.. ప్రమాదవశత్తు కిందపడి మృతి చెందాడు. సాయిబాబకు ఏడాది క్రితం వెల్దండ మండలం, రాచూరు గ్రామానికి చెందిన ఓ యువతీతో పెళ్లయింది. చిన్న వయస్సులోనే మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ప్రమాదం సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.