కాంగ్రెస్ పార్టీలోకి కొనసాగుతున్న వలసల పర్వం.

ఆరు గ్యారెంటీల సంక్షేమ పథకాలు అభివృద్ధికీ నిదర్శనం

శాయంపేట నేటి ధాత్రి:

హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు పలు పార్టీ కార్యకర్తలు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలోకి వలసలుగా వస్తున్నారని భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మండల పరిధిలోని శాయంపేట మాందారి పేట ,కొప్పుల గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మండల కేంద్రానికి తరలివచ్చి ఎమ్మెల్యే సమక్షంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలాన్ని అభివృద్ధి పథంలో తీసుకురావడానికి కృషి చేస్తానని అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రికి సౌకర్యాలు కల్పిస్తున్నాను. 124 చెరువులు వర్షాకాలానికి దెబ్బతిన్నాయి వాటికి 122 చెరువులు అనుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మిగిలినవన్నీ చేపిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. మండల కేంద్రానికి 108 సౌకర్యం కల్పించడం జరిగిందని అన్నారు రానున్న ఎన్నికల్లో అధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాష్ట్ర ముఖ్యమంత్రికి మన్నలను పొందాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ,అన్ని గ్రామాల అధ్యక్షులు, కాంగ్రెస్ కార్యకర్తలు అధిక మొత్తంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!