ఉద్యమకారుల బస్సుయాత్రకు నర్సంపేటలో ఘన స్వాగతం.

# అమరవీరుల స్తూపం వద్ద నివాళులు
ఈ నెల 27న సికింద్రాబాద్ లో జరిగే ఉద్యమకారుల సన్మాన పోస్టర్ ఆవిష్కరణ

నర్సంపేట,నేటిధాత్రి :

దక్షిణ తెలంగాణ ఉద్యమకారుల చైతన్య బస్సు యాత్ర నర్సంపేట పట్టణానికి చేరుకోగా నియోజకవర్గ వివిధ మండలల ఉఫ్యామకారులు ఘనస్వాగతం పలికారు.నర్సంపేట పట్టణ కేంద్రంలోని నందగిరి రజినీకాంత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బస్సు యాత్రలో భాగంగా ముఖ్య అతిథిలుగా హాజరైన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ రాష్ట్ర మహిళ ఫోరమ్ అధ్యక్షురాలు జ్యోతి రెడ్డి తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం తెలంగాణ తొలి,మలిదశ , ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులతో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యమమ కారులందరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేఫెస్టోలో ఇచ్చిన హామీలు 250 గజాల ఇండ్లు డబుల్ బెడ్ రూమ్, ఇండ్ల స్థలాలు, హెల్త్ కాడ్స్ , ఉద్యమ కారుల గుర్తింపు కాడ్స్ ,25000 వెల పెన్షన్ పథకాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.అనంతరం ఈ నెల 27 సికింద్రాబాద్ లో జరిగే హరి హరి కలభవన్ లో తెలంగాణ ఉద్యమకారులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం పోస్టర్ ను అవిష్కరించారు. ఈకార్య క్రమంలో వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు అల్లి యాదగిరి,మల్లాడి వీరారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కౌడగని రాజీరు, జిల్లా అధికార ప్రతినిధి ఆకుల సాంబరావు,వరంగల్ జిల్లా మీడియా ఇంచార్జి నర్మెట యాదగిరి,దార్ల రమాదేవి, పుట్టపాక కుమరస్వామి , సుదర్శన్ , వెంకట్ రెడ్డి,దోమల రవి, నెక్కొండ అధ్యక్షులు కొత్త సంపత్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి కార్యదర్శి కత్తుల సదానందం, చెన్నారావుమండల గౌరవ అధ్యక్షులు అంగోతు వీరసింగ్, అధ్యక్షులు లింగమూర్తి, ఉపాధ్యక్షులు ఉడుగుల సాంబయ్య తో పాటు నెక్కొండ, చెన్నారావుపేట,దుగ్గొండి,నల్లబెల్లి ఖానాపూర్, నర్సంపేట మండలాల ఉద్యమకారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *