రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామ అక్షర హైస్కూల్ విద్యార్థిని బండారి ప్రణీత గోదావరిఖనిలో నిర్వహించిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా స్థాయి కరాటే సెలక్షన్స్-68 వెయిట్ విభాగంలో ప్రథమ స్థానం సాధించి రాష్ట్రస్థాయికి ఎంపిక అయినట్లు అక్షర హై స్కూల్ కరస్పాండెంట్ తెలిపారు. ఈసందర్భంగా రామడుగు ఎస్ఐ తోట తిరుపతి పుష్పగుచ్చం ఇచ్చి విద్యార్థిని అభినందిస్తూ, మరిన్ని విజయాలు సాధించి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. ఈకార్యక్రమంలో కరెస్పాండెంట్ మినుకుల మునీందర్, కరాటే మాస్టర్ సుంకే రాజు, తదితరులు పాల్గొన్నారు.