భద్రాచలం నేటి ధాత్రి
భద్రాచలం పట్టణంలోని కూనవరం రోడ్డులో ఉన్న మారుతి నర్సింగ్ కళాశాల విద్యార్థిని పగిడిపల్లి కారుణ్య తీవ్రమైన గాయాలతో అపస్మార్క స్థితిలో చికిత్స పొందుతుంది.
కారుణ్య మొదటి సంవత్సరం బిఎస్సి నర్సింగ్ విద్యను ఈ కళాశాలలో అభ్యసిస్తుంది.
ఈరోజు తెల్లవారుజామున తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్ళింది.
కళాశాల వసతి గృహంలో ఈ సంఘటన జరగటం వలన అనుమానాలు కలుగుతున్నాయి.
కళాశాలకు కళాశాల వసతి గృహానికి సరైన రక్షణ చర్యలు లేవు.
ప్రహరి గోడలు కూడా లేవు.
మొదటి సంవత్సరం చదువుతున్న కారుణ్య పై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారా?
లేకపోతే బయట వ్యక్తులు హత్య ప్రయత్నం చేశారా?
ర్యాగింగ్ విషయంలో సీనియర్ విద్యార్థులు హత్యా ప్రయత్నం చేశారా?
కారుణ్య 1 నుండి ఇంటర్ వరకు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, గురుకుల కళాశాలలో చదువుకున్నది.
పదవ తరగతిలో 10/10 మార్కులతో ఉత్తీర్ణత.
ఇంటర్లో 901 మార్కులతో ఉత్తీర్ణత.
బాగా చదివే విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటుందా?
ఈ మిస్టరీని పోలీసులే చేదించాలి.