గంగారం, నేటిధాత్రి :
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఆదేశాలతో మండల పరిషత్, జిల్లా పరిషత్ ప్రజా ప్రతినిధులు పదవికాలం విజయవంతంగా ముగిసినందున గంగారం మండల ప్రజా ప్రతినిధులు గంగారం మండల ప్రజా పరిషత్ ప్రెసిడెంట్ సువర్ణపాక సరోజన జగ్గారావు, జడ్పీటీసీ ఈసం రమ సురేష్ ,వైస్ ఎంపీపీ ముడిగా వీరభద్ర పోతయ్య, ఎంపీటీసీ భద్రక్క ప్రభాకరన్న , కోఆప్షన్ ఎస్ కే సయ్యద్ గార్లను గురువారం రోజు గంగారం మండలం లో కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ తరుపున జాడి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన ఎంపీపీ, జడ్పీటీసీ, వైస్ ఎంపీపీ ఎంపీటీసీ కోఆప్షన్, ప్రజా ప్రతినిధులు మండల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని జాడి వెంకటేశ్వర్లు కొనియాడారు.భవిష్యత్తులో తమవంతు బాధ్యతగా ప్రజా సమస్యల పరిష్కారం లో కృషిచేయాలన్నారు. విజయవంతంగా పదవీ కాలాన్ని పూర్తి చేసినందుకు గంగారం మండల ప్రజా ప్రతి నిధులు అందరికీ పూలమాలలతో మెమంటో,శాలువాతో సత్కారించి వీడ్కోలు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత.. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పనిచేసేవాళ్లే నిజమైన రాజకీయ నాయకులని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు అన్నారు .
రాష్ట్ర మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క , మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాకు ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించి ఘనంగా సన్మానం చేసిన మీ అందరకి పేరు పేరున ధన్యవాదములు తెలుపుచున్నాను . తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వమే 15ఏళ్ళు అధికారంలో ఉంటామని పదవి విరమణ ఆత్మీయ వీడ్కోలు సమావేశం లో గంగారం మండల ప్రజా పరిషత్ ప్రెసిడెంట్ సువర్ణపాక సరోజన జగ్గారావు ధీమావ్యక్తంచేశారు.పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో దరిద్రమైనా ఇబ్బందులతో పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి ప్రజల చేత ఛీ కొట్టించుకున్నారని ఎంపీపీ అన్నారు. గతంలో కెసిఆర్ ప్రభుత్వం చేయని అభివృద్ధిని ఆరు నెలలలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపించిందని, రాష్ట్ర మంత్రి వర్యులు అనసూయ సీతక్క గారి నాయకత్వం లో ములుగు నియోజకవర్గం తో పాటు గంగారం మండలని ఎంతో అభివృద్ధి చేస్తామని పదవి విరమణ ఎంపీపీ సువర్ణపాక సరోజన జగ్గారావు ఈ సందర్బంగా అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ, వైస్ ఎంపీపీ, కోఆప్షన్ సమావేశంని ఉద్దిచించి మాట్లాడినారు. మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ముడిగా పోతయ్య, ప్రధాన కార్యదర్సులు రాదారపు కొమరయ్య, ధనసరి కమలహాసన్, కిసాన్ సెల్ అధ్యక్షులు ధనసరి సారయ్య, మహిళ అధ్యక్షురాలు ఈసం నర్సక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈసం సమ్మయ్య మాజీ సర్పంచు, మద్దెల సాంబయ్య మాజీ సర్పంచు.యూత్ ప్రెసిడెంట్ ముడిగా విజయ్, ఎస్ టీ సెల్ ప్రెసిడెంట్ భానోత్ సేవాలాల్ జనగాం రామస్వామి, భూర్కా శ్రీరాములు, పులసం సురేష్, ఈక సతీష్, భూక్యా బాలు,బోడ భోజ్యా, ఈసాల సారయ్య, సీతక్క అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు