పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం

ములుగు జిల్లా, నేటిధాత్రి:

ములుగు జిల్లా మల్లంపల్లి మండలం మల్లంపల్లి గ్రామంలో ఆదివారం రోజున 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సుమారు రెండు దశాబ్దాల కిందట తాము చదువుకున్న పాఠశాలలో ఒకే వేదికపై కలుసుకోవాలన్న ఆలోచనతో గత వారం రోజుల నుంచే పూర్వ విద్యార్థులు ప్రణాళిక రూపొందించుకొని ఈరోజు సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా తమకు విద్య బోధించిన గురువులకు మెమొంటోలు శాలువాలతో ఘనంగా సత్కరించారు బాల్యంలో తాము చదువుకున్న పాఠశాలలో తీపి గుర్తులను గుర్తు చేసుకున్నారు. అప్పటి బాల్య స్నేహితులు తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ఎక్కడెక్కడో స్థిరపడిన పలువురు పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై కలుసుకోవడం ఎంతగానో ఆనందాన్ని ఇచ్చిందని తమ ఉపన్యాసాలలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో చదివిన తోటి విద్యార్థి మరణించిన స్వామి కుటుంబానికి తమ వంతు కృషిగా ఆర్థిక సహాయం అందించిన పరిపూర్ణ చారి, సునీల్, సతీష్, పాపరావు గార్లను ఉపాధ్యాయులు అభినంధించినరు. ఈ సమ్మేళనం కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, మరియు 70 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!