చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని కాకతీయ హైస్కూల్లో 2005 2006 ఎస్ఎస్సి బ్యాచ్ కి చెందిన 53 మంది విద్యార్థిని విద్యార్థులు సోమవారం రోజున పాఠశాలలో కలుసుకొని పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమం జరుపుకున్నారు 19 సంవత్సరాల తర్వాత కలిసిన స్నేహితులందరూ పాఠశాలలోని తమ తరగతి గదుల లో నేర్చుకున్న పాఠాలను గుర్తుచేసుకొని తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ మొహమ్మద్ రాజ్ మహమ్మద్ మాట్లాడుతూ మా పాఠశాలను 19 90 లో స్థాపించి 2024 సంవత్సరం వరకు 34 సంవత్సరాలు గా ఎంతో మంది విద్యార్థులకు విద్యను అందించినందుకు వారు ప్రభుత్వ ఉద్యోగులుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గా దేశ విదేశాల్లో స్థిరపడి సమాజానికి వారి తల్లిదండ్రులకు పాఠశాలకు పేరు తెచ్చినందుకు చాలా గర్వంగా ఉందని తెలియజేశారు, ఇటీవల ప్రకటించిన డీఎస్సీ ఫలితాలలో ఏడుగురు విద్యార్థులు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా సాధించారు, ఈ కార్యక్రమంలో వారిని ఘనంగా సన్మానించారు అలాగే 2005 -2006 ఎస్ ఎస్ సి బ్యాచ్ చెందిన పూర్వ విద్యార్థులు బుర్ర ధనుంజయ్ అల్లం శ్రీకాంత్ ఆకుల శివ ఆకుల రాకేష్ చింతల హాస్య కొక్కుల రేష్మ గంపల శైలజ మధురకవి సృజన గోపగాని విష్ణు అరుణ మొదలగు 53 మంది విద్యార్థులు పాల్గొన్నారు.