జిల్లా జడ్జిగా భద్రాద్రి వాసి

భద్రాచలం నేటి ధాత్రి

మండా వెంకటేశ్వరరావు ఈ పేరు భద్రాచలం వాసులకు సుపరిచితం, ఖమ్మం మానేరు కాలేజీలో లా పూర్తి చేసి గోల్డ్ మెడల్ ఇన్ లా, టాపర్ ఆఫ్ ది యూనివర్సిటీగా నిలిచి భద్రాచలానికి వన్నె తెచ్చారు. ఆయన ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ … ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి_ వరంగల్ విధులు నిర్వహిస్తూ జిల్లా జడ్జిగా నేడు ఎన్నికయ్యారు. ఇది భద్రాచలం వాసులకు ఎంతో శుభ పరిణామం. తల్లిదండ్రులైన సత్యనారాయణ- నాగమణి దంపతులు ఆయనను చిన్ననాటి నుంచి చదివించి పెద్ద చేసి సమాజానికి ఏదైనా మంచి చేయాలని ఈ విధంగా తీర్చిదిద్దారని ఆయన తెలియజేశారు. జిల్లా జడ్జిగా ఎంపికైనందుకు గాను భద్రాచలం బారో అసోసియేషన్ వారు హర్షం వ్యక్తం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *