శ్రీపతి నగర్ లో సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి

మందమర్రి, నేటిధాత్రి:-

పట్టణంలోని శ్రీపతి నగర్ 44వ బూతులో సీసీ రోడ్లు, డ్రైనేజ్, మంచినీటి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ, శనివారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సోత్కు సుదర్శన్, శ్రీపతి నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పైడిమల్ల నర్సింగ్, నుగురి రాధ ల ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు వెంటనే స్పందించి రాబోయే సిడిపి నిధుల నుండి శ్రీపతి నగర్ లో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జమాల్ పూరి నర్సోజి, దాసరి స్రవంతి, పల్లెర్ల సునీత, దాట్ల పద్మ, మునీగాల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *