ప్రజా సేవకుడు ‘పొదెం ఆపదలో పేదలకు అండగా

గుర్తుకొస్తున్నాయ్
భద్రాచలం నేటి ధాత్రి

స్థానికుల మదిలో చెరగని ఆనాటి గురుతులు

పొదెం’ పదునైన పదం.
విలువలు నిలువెత్తు నిదర్శనం. రాజకీయ జీవితం మార్గదర్శకం. అందుకే అతను ప్రజానేత.ఆదర్శ బాట. ఆయనే గత భద్రాచలం శాసనసభ్యులు, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర అటవీ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య

2019,2020,2021లో కరోనా కల్లోలం కాలంలో ప్రజల మధ్య ఉంటూ, స్థానిక శాసనసభ్యులుగా ప్రజల బాగోగులు చూస్తూ, వారికి నిత్యవసరాలు అందించటం, 2022 జూలై వరదల సమయంలో కూడా తన వంతు సహాయం చేయటం నేటికీ స్థానికుల మదిలో చెరగని గుర్తులుగా మిగిలిపోయాయి. ప్రధానంగా కొండలు, గుట్టలు తదితర ప్రాంత ఆదివాసీల పట్ల తాను చూపిన చొరవ చేసిన సహాయం ఇప్పటికీ స్థానికులు చర్చించుకుంటుంటారు.

గెలుపోటములతో పని లేకుండా, ప్రజల మధ్య నిలబడటమే ‘పొదెం’ నికార్సైన రాజకీయ విలువలకు నిలువుటద్దం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!