మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక తంగళ్ళపల్లి ప్రెస్ క్లబ్ లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ లో మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పది రోజులు కాకముందే బి ఆర్ ఎస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే కరెంటు ఇస్తలేరని చెప్పడం సిగ్గుచేటు అని బిఆర్ఎస్ ప్రభుత్వ హయంలో అవినీతిమయంతో అభివృద్ధి కుంటుపడిందని దేశ అభివృద్ధి జరగడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఈ విషయాన్ని బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలని తెలంగాణ రాష్ట్ర అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను 90 రోజుల్లో పూర్తి చేస్తామని అధికారం పోయిందని పనికట్టుకుని అసత్య ప్రచారం చేస్తున్నారని అలాంటి బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు నమ్మవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ వేములవాడ ఎమ్మెల్యే మన ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలిచి అలాగే రాష్ట్ర ప్రభుత్వవిఫ్ తొలిసారిగా.రాజన్న సిరిసిల్ల జిల్లాకు వస్తున్న శుభ సందర్భంగాజిల్లా సరిహద్దులో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కి ఘన స్వాగతం పలకాలని పెద్ద ఎత్తున కార్యకర్తలు తరిలిరావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఇట్టి కార్యక్రమంలో మండల జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!