“Petition Submitted for Construction of New Library at Chityala”
నూతన గ్రంథాలయం నిర్మించాలని జిల్లా చైర్మన్ కు వినతి పత్రం అందజేత.
చిట్యాల, నేటిదాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లాచిట్యాల మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణంలో ఉన్నటువంటి గ్రంథాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా చైర్మన్ కోట రాజబాబు ని చిట్యాల సర్పంచ్ తౌటం లక్ష్మి, అంతులు ఆదేశాల మేరకు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది అనంతరం చిట్యాల గ్రంధాలయం గ్రామపంచాయతీలో ఉండడం ద్వారా పరిపాలనకు ఇబ్బందికరంగా మారిందని ఇరుకు గదిలో గ్రంథాలయం ఉండడం జరిగిందని, కావున* నూతన గ్రంధాలయ భవనాన్ని నిర్మించి గ్రంధాలయ పాఠకులకు సౌకర్యం కలిగించాలని బుధవారం రోజున పంచి బుర్ర వెంకటేష్ గౌడ్, వార్డ్ మెంబర్ తౌటం నవీన్ గ్రామపంచాయతీ పాలవర్గం తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది, అనంతరం గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు మాట్లాడుతూ తప్పకుండా*నూతన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది*ఈ కార్యక్రమంలో నాలుగో వార్డు సభ్యుడు తౌటం నవీన్ మార్కెట్ కమిటీ చైర్మన్ గు మ్మడి శ్రీదేవి, ఉప సర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు బుర్ర లక్ష్మణ్ గౌడ్ , దొడ్డికిష్టయ్య, గ్రంథాలయ ఇన్చార్జి గంగాధర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
