శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట చేనేత సహకార సంఘానికి రావలసిన పెండింగ్ బకాయిలు సంఘంలో నిల్వ ఉన్న చేనేత వస్త్రాలు కొనుగోలు చేయుట ,ఆ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావుని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో నిన్న రాత్రి హైదరాబాదులోని చేనేతమంత్రి క్వాటర్స్ లో కలవడం జరిగినది ఈ సందర్భంగా వారు చేనేత సహకార సంఘం కార్మికులు సహకార సంఘానికి రావాల్సింది పెండింగ్ బకాయిలు ఇప్పిస్తూ నిల్వ ఉన్న చేనేత వస్త్రాలను ప్రభుత్వం తరుపున కొనుగోలు చేసి కార్మికులకు ఉపాధి కల్పించి వలసిందిగా కోరుతూ మంత్రిగారికి వినతిపత్రం ఇవ్వడం జరిగినది ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చేనేత కార్మికులకు సంబంధించిన బకాయిలు చెల్లించడంతోపాటు ప్రభుత్వం తరఫున చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి వారికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి చిందం రవి సహకార సంఘం పిఐసి చైర్మన్ మామిడి శంకర్ లింగం పాలకవర్గ సభ్యులు బూర లక్ష్మీనారాయణ బాసాని సాంబయ్య దిడ్డి ప్రభాకర్ సంఘం మేనేజర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.