నిజాంపేట: నేటి ధాత్రి
మండల కేంద్రం ఏర్పడినప్పుడు నుండి మండల కేంద్రానికి ఎమర్జెన్సీ అంబులెన్స్ సేవలు లేక నిరుపేదలు ఇబ్బందులకు గురవుతున్నారన్న ఉద్దేశంతో
మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సోమవారం నిజాంపేట మండల కేంద్రానికి నూతన అంబులెన్స్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిజాంపేట మండల కేంద్రాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తుందనిఆయన కొనియాడారు.అనంతరం మండల పరిధిలోని నస్కల్ గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ నర్సింలు మృతి చెందిన విషయాన్ని తెలుసుకొని వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చౌదరి సుప్రభాత రావు, అమర్ సేన రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పంజా మహేందర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మారుతి, పట్టణ అధ్యక్షుడు నజీరుద్దీన్, ఎం ఎస్ ఎస్ ఓ మండల అధ్యక్షుడు వెంకట్ గౌడ్, గుమ్ముల అజయ్, తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.