
చిట్యాల లో వైద్య శిబిరం
ఏటూరునాగారం, నేటి ధాత్రి
కన్నాయిగూడెం మండల పరిధిలోని చిట్యాల గ్రామంలో ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ అభినవ్ గారి ఆధ్వర్యంలో బుధవారం వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది రక్త పరీక్షలను నిర్వహించి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది 52 మందిని డాక్టర్ గారు పరీక్షించగా 12 మందికి రక్త పరీక్షలు చేయగా వారికి మలేరియా నెగిటివ్ గానే ఉంది ఇద్దరినీ బీపీతో బాధపడే వారిని మరియు థైరాయిడ్ తో బాధపడే వారిని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి రిఫర్ చేయడం జరిగిందిఇందులో ఇంటింటికి సర్వే చేయడం ఫ్రైడే కార్యక్రమం లో పాల్గొనడం, పాఠశాలను సందర్శించడం జరిగింది ఇందులో విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పోషకాహార విలువలను గురించి వివరించడం జరిగింది ఇందులో నీతి అయోగ్ రవీష్, హెల్త్ ఎడ్యుకేటర్ సుజాత ఫార్మసిస్ట్ ఆఫీసర్ శారద , ఎన్ సి డి నర్సింగ్ ఆఫీసర్ అజ్మీరీ, హెల్త్ అసిస్టెంట్ లక్ష్మణ్ పాల్గొన్నారు