కాంగ్రెస్ పార్టీలోకి భారీ గా చేరికలు

వనపర్తి నేటిదాత్రి
ఏబ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పర్వతాలు, జడ్పిటిసి మంద భార్గవి కోటేశ్వర్ రెడ్డి మాజీ ఎంపీపీ సత్య శీలా రెడ్డిలా ఆధ్వర్యంలో
కాంగ్రెస్ పార్టీలో చేరిన గొర్రెల కాపరుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కందూరి చంద్రయ్య
తాడిపత్రి మాజీ సర్పంచ్ లోకా రెడ్డి
_పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో స్థానికుల సలహా , సూచనల, కోరిక మేరకు పార్టీ బలోపేతాన్ని దృష్టిలో ఉంచుకొని బీ ఆర్ ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు కొనసాగుతున్నాయి
ఈ మేరకు శుక్రవారం వనపర్తి నంది హిల్స్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గోపాల్పేట మండలం తాడిపర్తి గ్రామానికి చెందిన జిల్లా గొర్రెల కాపరుల సంఘం ఉపాధ్యక్షులు కందూరు చంద్రయ్య, మాజీ సర్పంచ్ లోకా రెడ్డితో పాటు మరో 50 మంది బీ ఆర్ ఎస్ కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు
వీరికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తమకు ఎలాంటి గౌరవం దక్కలేదని కేవలం ప్రజా ప్రతినిధులుగా ఉన్నామే తప్ప పాలన మాత్రం మా చేతులలో లేకుండా ఉండేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు
_ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులమై కాంగ్రెస్ పార్టీలో చేరామని వారు పేర్కొన్నారు_*కార్యక్రమంలో గోపాల్పేట మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!