వైకుంఠధామ దారిలో అడ్డంకిగా భారీ మురుగు కాలువ.

Murugu canal Murugu canal

వైకుంఠధామ దారిలో అడ్డంకిగా భారీ మురుగు కాలువ.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

కోహిర్ మండలం నాగిరెడ్డిపల్లి వెళ్లే మార్గంలో స్థానిక వైకుం ఠధామం వద్దకు వెళ్లే దారిలో భారీ మురుగు కాలువ ఏర్పడటంతో స్థానికులు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. ఈకాలువ కారణం గా స్మశానవాటికకు వెళ్లేమార్గం అడ్డంకులతో కూడుకున్నది దీంతో అంత్యక్రియలు, ఇతర ఆ చారాలు నిర్వహించడం కష్టతరంగా మారింది. స్తానికులు తెలిపిన వివరాల ప్రకారం.ఈ ము రుగు కాలువ నీరు చుట్టుపక్కల ప్రాంతాలను కలుషితం చేస్తూ దుర్వాసన వెదజల్లుతుంది. ఈ సమస్య వల్ల స్మశానవాటికకు వెళ్లేవారు ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మురుగు కాలువ వల్ల మార్గం పూర్తిగా మునిగిపోయింది. అంత్యక్రియలకు వెళ్లడం కూడా కష్టంగా మారిందని స్థాని కులు తెలిపారు. అధికారులు ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని మురు గు కాలువను మూసివేసి స్మశానవాటికకు సరైన మార్గం ఏర్పాటు చేయాలని స్థానికు లు కోరుతున్నారు. ఈవిషయంలో తహశీల్దార్ కార్యాలయం తగిన చర్య లు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈసమస్యపై అధికారుల స్పం దన కోసం స్థానికులు ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!