ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ

భూపాలపల్లి నేటిధాత్రి

మోడీ సర్కార్ కార్పొరేటు మతతత్వ విధానాన్ని నిరసిస్తూ
ఫిబ్రవరి 16వ తారీఖున జరిగే దేశవ్యాప్త సమ్మె,గ్రామీణ బంద్ ను జయప్రదం చేయండి.
ప్రజా సంఘాల పిలుపు.
ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కార్ల మార్క్స్ కాలనీలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ బైక్ ర్యాలీలో సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, కెవిపిఎస్, ప్రజాతంత్ర మహిళా సమైక్య, సంఘాలు పాల్గొన్నాయి.
ఈ బైక్ ర్యాలీని ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బందు సాయిలు, ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలేము రాజేందర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 16వ తారీఖున దేశవ్యాప్తంగా జరిగే సమ్మె గ్రామీణ బందును జయప్రదం చేయాలని ప్రజలందరికీ పిలుపునిచ్చారు, మోడీ సర్కారు అనుసరించే కార్పోరేట్ మతతత్వ విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా సమ్మె బందు నిర్వహిస్తున్నామని అన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వడంలో లోపం జరిగింది. కార్మిక చట్టాలను సవరిస్తున్నాడు. పెట్టుబడుదారులకు అనుకూలంగా మోడీ సర్కారు వ్యవహరిస్తున్నాడు. పేదల మీద భారాలు పెట్టుబడుదారులకు రాయితీలు ఇచ్చే అటువంటి పద్ధతిని మోడీ సర్కార్ అవలంబిస్తున్నాడు. రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నాడు. కూలీల వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నాడు. ధరలు విపరీతంగా పెంచాడు. నచ్చడానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్న మోడీ ఒక్క ఉద్యోగాన్ని కూడా నింప లేదు. కొత్త పరిశ్రమలు లేవు కొత్త కొలువులు లేక నిరుద్యోగుల సంఖ్య పెరిగే ఆత్మహత్యల పాలవుతున్నారు. గ్రామీణ ఉపాధి చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నాడు. అటవీ హక్కుల చట్టానికి తూట్లు పడుతున్నాడు. జీరో అకౌంట్ లో 15 లక్షలు చేస్తామన్న మోడీ ఒక్క రూపాయి బిళ్ళ కూడా వేయక ప్రజలకు అన్యాయం చేశాడు. బ్యాంకులు, బిఎస్ఎన్ఎల్, ఓడరేవులు, రైల్వేలు, విమానాలు, బొగ్గు రంగాన్ని, విద్య, వైద్యాన్ని కార్పొరేట్ శక్తులకు కారు చౌకకు అమ్మేస్తున్నాడు. చివరికి ఎర్రకోటానికి కూడా ప్రైవేటు వ్యక్తులకు ధారాధక్కం చేశాడు. ఫిబ్రవరి 16వ తారీఖున దేశవ్యాప్తంగా జరిగే దేశవ్యాప్త సమ్మె గ్రామీణ బందు లో బిజెపి, బిఎంఎస్ మినహా అన్ని కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు బిజెపి కార్పొరేటు మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా జరిగే సమ్మె గ్రామీణ బందులో కలిసి వస్తున్నాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు నుండి ఆకుదారి రమేష్, రవి కుమారు, గట్టు శంకర్, బిక్షపతి, వ్యవసాయ కార్మిక సంఘము నుండి పొలం చిన్న రాజేందర్, రైతు సంఘము నుండి రాధారపు మల్లయ్య, ఆదివాసి గిరిజన సంఘము నుండి గూడెల్లి శ్రీకాంత్, కెవిపిఎస్ నుండి శ్రీధర్, అఖిల భారత మహిళా ప్రజాతంత్ర సమైక్య నుండి వి లక్ష్మి, సుజాత, అఖిల భారత యువజన సమైక్య నుండి ఆతుకూరి శ్రీకాంత్, స్వర్ణలత, కవిత, నవీను, ఎస్ఎఫ్ఐ నుండి రాజు, మరణ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *