5వ తరగతి విద్యార్థులకు ఆత్మీయ వీడ్కోలు
కేసముద్రం/ నేటి ధాత్రి
ఎమ్. పి.పి.ఎస్ కల్వల పాఠశాల లో ఈరోజు 5వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం పాఠశాల ప్రధానోపాధ్యాయులు కళ్లెం వీరారెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి కాలేరు యాదగిరి, గౌరవ అతిథిగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బండారు నరేందర్ విచ్చేయడం జరిగింది. ఈ సమావేశంలో విద్యాశాఖ అధికారి కాలేరు యాదగిరి విద్యార్థులను మంచి విద్యావంతులు గా మార్చి, భావి భారత పౌరులు గా తీర్చి దిద్దడంలో ఉపాధ్యాయుల కృషి వెలకట్టలేనిది. ఈనాడు ప్రభుత్వ పాఠశాల లో చదువు కున్న వారే నేడు గొప్ప స్థానంలో వున్నారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాల లో చదివించాలని పిలుపునిచ్చారు. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బండారు నరేందర్ మాట్లాడుతూ విద్యార్థులను అన్ని రంగాలలో సర్వతోముఖ అభివృద్ధికి పాటు పడటం కేవలంప్రభుత్వ పాఠశాల తోనే సాధ్యం అని, ప్రభుత్వ విద్యా రంగం ను బలోపేతం చేయాలని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కళ్లెం వీరారెడ్డి మాట్లాడుతూ ఇంగ్లీష్ భాషను ఒక భాష లాగే చూడాలని, సబ్జెక్టు కు ఆపాదించవద్దని, మాతృభాష లోనే ఎక్కువ విషయావగాహనను, జ్ఞానాన్ని పొందదగలరని అన్నారు. ఇంగ్లీష్ మీడియం విద్య అని విద్యార్థులను ఏ భాష సరిగా రాకుండాచేస్తున్నారని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినిీ ఉపాధ్యాయులైన గోపి, స్వరూప, హరిక్రిష్ణ, క్రిష్ణ,శ్రీదేవి, మోహనకృష్ణ, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తలిదండ్రులు ,విద్యార్థులు పాల్గొన్నారు.