రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదర గ్రామాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ గా నేరెళ్ల శారద ఎన్నికైన తర్వాత మొదటిసారిగా సందర్శించారు. ఈసందర్భంగా గ్రామంలోని శ్రీవెంకటేశ్వర స్వామి, మార్కండేయ స్వామి, వారి కుల దైవమైన ఎల్లమ్మ తల్లి ఆలయాలను సందర్శించి మొక్కలు చెల్లించుకున్నారు. అనంతరం గ్రామంలోని పెద్దమనుషుల అందరిని సాదరంగా పలకరింపు చేపట్టారు. ఆమె రాకతో గ్రామంలోని మహిళలు, పెద్దలు, వివిధ నాయకులు పుష్పగుచ్చాలతో శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈకార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కోల రమేష్, రామడుగు మండల కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు గుడ్ల భవాని మల్లికార్జున్, మాజీ సర్పంచులు సంగీత రాజశేఖర్, ద్యావ అనంతరెడ్డి, మాధవరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నేరెళ్ల మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.