Student Felicitated for MBBS Seat Achievement
ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థినికి ఘన సన్మానం.
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట మండలంలోని గురిజాల గ్రామానికి చెందిన ఆముదాల భాగ్యలక్ష్మి – లక్ష్మీనారాయణ దంపతుల కూతురు ప్రహర్ష కు ఎంబిబిఎస్ సీటు వచ్చినందున గాను బిఆర్ఎస్ గ్రామపార్టీ అధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు చిన్నపెళ్లి నర్షింగం మాట్లాడుతూ మంచిగా చదివి గొప్ప డాక్టర్ అయి పేదలకు వైద్య సేవలు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు గడ్డం కొమురయ్య,బండారి శ్రీలత – రమేష్,న్యాయవాది,పార్టి క్లస్టర్ ఇన్చార్జి మోటురీ రవి,రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ అన్న రాజమల్లు,మండల పార్టీ ఉపాధ్యక్షుడు అల్లి రవి,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు పత్రీ కుమారస్వామి,గౌడ సంఘం గౌరవ అధ్యక్షుడు మంచిక దేవేందర్,మాజీ వార్డు సభ్యులు కొక్కు రాంరాజు,మాజీ ఎస్ఎంసి ఛైర్మన్ కొమ్మ రవి,మాజీ గ్రామ పార్టి అధ్యక్షుడు దుడేల ప్రకాశ్,మాజీ నీటి సంఘం అధ్యక్షుడు మాటురీ రవీంద్రచారి,యూత్ మండల సహయ కార్యదర్శి బుస శ్రీశైలం,సీనియర్ నాయకులు పర్స కోటిలింగం,మర్ద నవీన్,సామల సతీష్,యశోద నరసింగం,బండారి మధుకర్,కునమల్ల కిరణ్ తదితులున్నారు.
