
ఘనంగా అయ్యప్పస్వామి మహాదివ్య పడిపూజ
ఉత్తర నక్షత్రం సందర్భంగా అభిషేకాలు
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణంలోని శ్రీ ధర్మ శాస్త అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్పస్వామి మహాదివ్య పడిపూజ మంగళవారం ఘనంగా నిర్వహించారు.అయ్యప్పస్వామి ఉత్తర నక్షత్ర జాతకంతో జన్మించిన నేపథ్యంలో ప్రతీ నెల వచ్చే ఉత్తర నక్షత్ర గడియలు వస్తున్న తరుణంలో నర్సంపేట శ్రీ ధర్మ శాస్త దేవాలయ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గత ఐదు నెలలుగా ప్రత్యేక పడిపూజలు నిర్వహిస్తున్నారు.దేవాలయ ట్రస్టు చైర్మన్ సింగిరికొండ మాధవశంకర్ గుప్తా, అధ్యక్షుడు సైపా సురేష్ ఆధ్వర్యంలో దేవాలయంలో అయ్యప్పస్వామి పడిపూజ నిర్వహించారు.ఉదయం గర్భగుడిలో సుప్రభాతంతో మొదలై హోమం కార్యక్రమం,ప్రత్యేక పూజలు చేపట్టారు.అనంతరం అయ్యప్పస్వామి ఉత్తర నక్షత్ర పడిపూజ,అభిషేకం,అన్నదాన దాతలుగా బాదం శ్రావణి రంజిత్ కుమార్,సింగరికొండ స్వరాజ్యలక్ష్మి ఉపేందర్ కుటుంబాల ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు దేవేశ్ మిశ్రా బృందం వేధ మంత్రోచ్చారణతో మహాదివ్య పడిపూజ చేపట్టారు.ముందుగా 18 కలశాల పూజలు,మెట్ల పూజలు చేశారు.ఈ సందర్భంగా అయ్యప్పస్వామికి నెయ్యి, తేనే,చక్కర,పంచాంతృతం,గంధం,
విభూదితో అష్టాభిషేకాలు,కలశాభిషేకాలు చేపట్టారు. అనంతరం పుష్పాభిషేకం చేశారు.
ఈ నేపథ్యంలో పడునెట్టాంబడిపై కర్పూర జ్యోతులతో వెలిగించడంతో భక్తులు మురిసిపోయారు.కళ్యాణరాముడు సురేష్,దొడ్డ వేణు,రంగనాథ్ బృందం ఆలపించిన భజన పాటలతో,భక్తుల శరణఘోషతో దేవాలయ ప్రాంగణం ఎంతగానో మారుమ్రోగింది.అనంతరం మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని
దాత సింగరికొండ స్వరాజ్యలక్ష్మి ఉపేందర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ మాధవ శంకర్ మాట్లాడుతూ వచ్చే మండల పూజల మహోత్సవాలలో అయ్యప్పస్వామి దీక్ష చేపట్టి ఇరుముడి సమర్పించే భక్తులకు ఉచిత వసతి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో దేవాలయ ట్రస్టు ప్రధాన కార్యదర్శి చింతల కమలాకర్ రెడ్డి, కోశాధికారి దొడ్డ రవీందర్ గుప్తా,దోమకుంట్ల నందయ్య గురుస్వామి, శ్రీరాం ఈశ్వరయ్య ఇరుకుల్ల వీరలింగం,భూపతి లక్ష్మీనారాయణ,బండారుపల్లి చెంచారావు,పాలకుర్తి శ్రీనివాస్,వజినపెల్లి శ్రీనివాస్,దొడ్డ వేణు,అనంతుల రాంనారాయణ, మల్యాల రాజు,మల్యాల ప్రవీణ్,భీరం నాగిరెడ్డి,రాంచందర్,కర్ణాకర్,మండల వీరస్వామి గౌడ్,బాదం అనిల్,శ్రీనివాస్, శ్రీరాం కిరణ్,గురుస్వాములు సంజీవ రావు,బొట్ల నాగరాజు, యాదగిరి,అనిల్,ఆలయ గుమస్తా దేశి రాము అర్చకులు ఫ్రాన్స్,శివాంకిత్,ఆనంద్,తో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.