ఘనంగా పుష్పక విమాన రథోత్సవం..
: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నల్లగొండ జిల్లా, నేటి దాత్రి:
చండూరు మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామంలో గల శ్రీ రామలింగేశ్వర స్వామి (జాతర) బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం విమాన రథోత్సవ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు. అనంతరం రరమలింగేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాజగోపాల్ రెడ్డి. వేదమంత్రాల మధ్య స్వామివారి రథాన్ని లాగారు.
ఈ సందర్భంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… రామలింగేశ్వర స్వామి దయవల్ల ఈ ప్రాంతం అంతా పచ్చని పంటలతో, పిల్లాపాపలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, అందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని స్వామివారిని వేడుకొండానని అన్నారు. మీకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు రామలింగేశ్వర స్వామి కృపకు పాత్రుడనై ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గున్ రెడ్డి రమ్య, రామలింగారెడ్డి, ఆలయ కార్య నిర్వాణ అధికారి నాగిరెడ్డి, కోడి శ్రీనివాసులు, దోటి టి వెంకటేశ్ యాదవ్, నల్లగంటి మల్లేష్ ఆలయ సభ్యులు, వంశపార్యపర్య అర్చకులు, స్థానిక నాయకులు, తదితరులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.