నర్సంపేట,నేటిధాత్రి :
ప్రపంచ ఓజోన్ డే దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏయస్ఆర్ సేవా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఎర్రబోయిన రాజశేఖర్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.పట్టణంలోని ఏసిపి కార్యాలయంలో ఆవరణలో అసిస్టెంట్ ఏసిపి కిరణ్ కుమార్ మొక్కలు నాటారు.అనంతరం ఎసిపి మాట్లాడుతూ ఓజోన్ పొర దెబ్బతినకుండా ఉండటానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుతూ,కాలుష్య నియంత్రణ కొరకు ఇంధన కాలుష్యాన్ని తగ్గించాలని అలాగే పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.కార్యక్రమంలో ఏఎస్ఆర్ ఆర్గనైజేషన్ సభ్యులు రాము సేవక్,పాలకుర్తి మహేందర్,పాలడుగుల నాగరాజు,ఏసిపి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.