ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
నర్సంపేట,నేటిధాత్రి:
దుగ్గొండి మండలంలోని మహ్మదాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2004 – 2005 లో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సోమవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారివారి యోగ క్షేమాలు తెలుసుకున్నారు.ఆనాటి గురువులైన గుండా శ్రీనివాస్, ఉమాశంకర్, సాయిలు ఆహ్వానించి ఘనంగా సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పెంచాల సతీష్,నన్న నరేష్, పొన్నం అశోక్, ఇనుముల కిషోర్, రేగుల శివ, ఎలకంటి మహేష్, మోటం మహేందర్, పలకల మధుసూదన్ రెడ్డి,వంగ ప్రకాష్, గాజు నాగరాజ్, ఎద్దు రంజిత్, మురారి మహేందర్, రావులకోల రాణి, రంపిస సంగీత, మర్రి స్రవంతి, ఎలకంటి స్వప్న,బరిగల కోమల, చల్ల శ్రీలత, చొప్పరి శ్రీలత, అంబీర్ లతా, పుష్పనీల, యమునా, రాధా, మంజుల తోపాటు స్కూల్ చైర్మన్ చింత సాంబయ్య పాల్గొన్నారు.