మరణంలోనూ వీడని స్నేహం…
• రోడ్డుప్రమాదం లొ ఇద్దరు نهم మృతి”
• వెంటిలేటర్ పై మరొకరికి చికిత్స
• తల్లిదండ్రులు, భార్యాపిల్లల ఆర్తనాదాలు
రత్నాపూర్లో విషాద ఛాయలు
•ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి
రత్నాపూర్ లో విషాద ఛాయలు..
• రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ స్నేహితులు
• ఇద్దరు మృతి, వెంటిలేటర్ పై మరొకరు
• తల్లీదండ్రులు, భార్యాపిల్లల ఆర్తనాదాలు
• మరో మృతదేహం వస్తుందేమోనని భయం భయంగా గ్రామస్తులు
• మృతులకు కన్నీటి వీడ్కోలు
• ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి
జహీరాబాద్. నేటి ధాత్రి:
ఝరాసంగం: రెక్కాడితే గానీ డొక్క నిండని పరి
స్థితి వారిది.. వారి శ్రమతోనే వారి జీవితాలు ఆధారప డీ ఉన్నాయి. విధి వారి జీవితాలను ఒక విషాదభరిత మై న నాటకంగా మార్చింది. వారి శ్రమపై ఆధారపడ టం ఇష్టం లేదన్నట్టుగా వారి జీవితాలు మరింత దయ నీయ స్థితికి చేర్చి కుటుంబాలలో తీరని దుఃఖాన్ని నింపింది. ముగ్గురు స్నేహితులు మూడు రోజుల వ్య వధిలో మృత్యు ఒడిలోకి చేరుకున్న విషాద ఘటన తెలంగాణ-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో చోటు చేసు కుంది.

గ్రామస్తులు, స్నేహితులు తెలిపిన వివరాల ప్ర కా రం… సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ మండలం రత్నా పూర్ గ్రామానికి చెందిన ముగ్గురు కూలీ స్నేహితులు మున్నూరు రమేష్, ఇస్మాయిల్, చాకలి బస్వరాజ్ రోజులాగే ఆదివారం ఉదయం నవ్వుతూ ఇంటి నుంచి కూలి పనికి వెళ్లారు. కర్ణాటకలోని బీదర్ ప్రాంతానికి కూలి పనికి వెళ్లారు. పని ముగించుకుని బైక్పై తిరిగి వస్తుండగా బీదర్ జిల్లాలోని బాల్కి ఖానాపూర్ సమీపంలో వారిని వెనుక నుంచి వేగంగా వచ్చిన టెంపో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఇస్మాయిల్ (24) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు రోజు వారి కూలి కార్మికుడు. ఆయన తల్లిదండ్రులు ఆయన పైన ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. మున్నూరు రమేష్, చాకలి బస్వరా జును బీదర్ ఆస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలిం చారు. రమేష్ మృ త్యువు తో పోరాడుతూ సోమ వారం తుదిశ్వాస విడి చాడు.

మృతుడికి ఒక అ మ్మాయి ఒక అబ్బాయి ఉ న్నారు. ర మేష్ రోజు వారి కూలిగా ఉంటూ గ్రామంలోని 40 నుంచి 50 మం ది కులీ కార్మి కులకు పని కల్పించేవాడు. భార్య శ్రీదేవి కూలి పని చేసుకుంటూ జీవనం సాగించే వా రు. ఇక మిగిలిన మరో స్నే వెంటిలేటర్పై ప్రా ణాలతో పోరాడుతున్నాడు. ఇ తడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్య పుష్పమ్మ కూలి పని చేస్తుంది. ఒకరి తర్వాత మరొకరి మృతదేహాలు గ్రామానికి చేరుతుండటంతో గ్రామ స్తులు, బంధువులు, స్నేహితులు తీవ్ర ది గ్రాం తికి గుర య్యారు. గ్రామస్తుల కన్నీటి ధార అగడం లేదు. రత్నా పూర్ లో విషాద ఛాయలు అలుముకు న్నాయి. మృతు ల తల్లిదండ్రులు, భార్యాపిల్లల ఆర్తనా దాలు అక్క డున్న వారందరిని కంటతడి పెట్టిస్తు న్నాయి. మరో మృత దేహం వస్తుందేమోనని భయప డుతూ, ప్రాణాలతో పోరాడుతున్న బస్వరాజు ఆయుష్షు పెంచాలని గ్రామస్తులు దేవుడిని వేడుకుంటున్నారు. ఇంతటి విషాదం సంభవించినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక నాయకులు ఎవరూ స్పందించకపో వడం, వారిని పరామర్శించకపోవడం రత్నాపూర్ గ్రామస్తులను మరింత దుఃఖానికి గురిచేసింది. ఘటన కర్ణాటకలో జరగడంతో ఖానాపూర్ పరిధిలోని దన్నూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.