పాక్ కు సరైన గుణపాఠం.. జై హింద్: షేక్ రబ్బానీ.
జహీరాబాద్ నేటి ధాత్రి:
‘ఆపరేషన్ సింధూర్’పై ఝరాసంగం ఎంఐఎం మండల అధ్యక్షుడు షేక్ రబ్బానీ హర్షం వ్యక్తం చేశారు. ‘పాకిస్థాన్లోని టెర్రరిస్ట్ స్థావరాలపై భారత్ నిర్వహించిన దాడులను ఆహ్వానిస్తున్నాం. మరో పహల్గామ్ ఘటన జరగకుండా పాక్కు ఇలాగే సరైన గుణపాఠం చెప్పాలి. పాక్ టెర్రర్ స్థావరాలు అన్నింటినీ పూర్తిగా ధ్వంసం చేయాలి. జై హింద్’ అని పోస్ట్ చేశారు. భారత్ నిర్వహించిన మెరుపు దాడుల్లో దాదాపు 80 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం.పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై మన రక్షణ దళాలు జరిపిన లక్షిత దాడులను నేను స్వాగతిస్తున్నాను. పాకిస్తాన్ లోతైన రాజ్యానికి ఒక గుణపాఠం నేర్పించాలి, పాకిస్తాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేయాలి. జై హింద్!