శేరిలింగంపల్లి నేటి ధాత్రి:- తారానగర్ లోని విద్యానికేతన్ స్కూల్ లో పతంజలి యోగ సమితి, భారత్ స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత ఇంటిగ్రేటెడ్ యోగ శిబిరాన్ని నిర్వహించారు. పతంజలి యోగ పీఠ్ జాతీయ అధ్యక్షులు పూజ్య డాక్టర్ పరమార్ధ దేవ్ పర్యవేక్షణలో కొనసాగిన ఈ శిబిరంలో శేరిలింగంపల్లి పరిసర ప్రాంతాలకు చెందిన యోగ ప్రియులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. శిబిరార్ధులచే వ్యాయామ, ఆసన, ప్రాణాయామాలు చేయించిన స్వామీజీ పలు ఆరోగ్య నియమాలను సూచించారు. రోగరహిత జీవనం యోగాతోనే సాధ్యమని అన్నారు. రోజువారి జీవితంలో ఆహార, జల, నిద్రా నియమాలు విధిగా పాటించాలని అన్నారు. మనం తీసుకునే ఆహారంలో పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు చేర్చాలని సూచించారు. భారతీయ జీవన విదానం, రిషి పరంపర విశ్వ వ్యాప్త ప్రాచుర్యం పొదండం శుభసూచకమని అన్నారు. పూర్వీకుల ఆచార వ్యవహారాలు పూర్తిస్థాయిలో తిరిగి వాడుకలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఇంట్లో రోజు తప్పనిసరిగా యోగా, హోమం చేయాలని సూచించారు. అనేక రోగాలకు ప్రాణాయామమే దివ్య ఔషదమని అన్నారు. ఈ కార్యక్రమంలో భారత్ స్వాబిమాన్ ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీదర్ జీ గారు, సంఘటన మంత్రి నందనం కృపాకర్ గారు, ఉపాధ్యక్షులు శివకుమార్ గారు, పతంజలి యోగ సమితి రాష్ట్ర అధ్యక్షులు శివుడు గారు, హైదరాబాద్ వెస్ట్ అధ్యక్షులు విఠల్ గారు, యోగ ప్రచారకులు అశోక్ ఆర్య, రామ ముని, హైదరాబాద్ వెస్ట్ జిల్లా బి ఎస్ టి ఉపాధ్యక్షులు నూనె సురేందర్, యువ భారత్ అధ్యక్షులు పుట్ట వినయ కుమార్ గౌడ్ పతాంజలి యోగ సమితి ప్రతినిధులు ధీరజ్ సింగ్, తరిగొప్పుల స్వేత, జగన్నాథం, వెంకటేశ్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
